నరసాపురంలో నేడు ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం

W .G: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నరసాపురం ఆర్డీఓ దాసి రాజు చెప్పారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులు ఉదయం 10.30 గంటల నుంచి అందించాలని చెప్పారు.