స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి: కలెక్టర్
GDWL: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని ఇవాళ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి EVMను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్, ప్రతినిధులు పాల్గొన్నారు.