బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్దానిక 38వ డివిజన్ గోకపేటలో గోడ కూలి రెయ్యి సన్యాసమ్మ (74) అనే మహిళ మరణించారు. ఈ నేపథ్యంలో స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబ పరామర్శించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.