రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: కలెక్టర్

ADB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. భోరజ్ మండలం తరోడలో నిర్వహిస్తున్న భూ భారతి సదస్సుకు బుధవారం ఆయన హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి భూ సమస్య లున్నా పరిష్కరించుకోవాలని కోరారు. ఆయనతో పాటు భీంపూర్ తహశీల్దార్ నలందప్రియ ఉన్నారు.