ఈనెల 23 నుంచి 26 వరకు ఘనంగా జాతర
ASR: కొయ్యూరు మండలం నడింపాలెం, శరభన్నపాలెం గ్రామాల మధ్యలో వెలసిన ఎర్రకొండమ్మ జాతర మహోత్సవాలను ఈనెల 23 నుంచి 26 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గొడ్డేటి మహేశ్ తెలిపారు. బుధవారం అమ్మవారి ఆలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. జాతరకు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు.