నందవరంలో మూడవరోజు దేవి శరన్నవరాత్రులు..
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో దేవి శరన్నవరాత్రులు మూడవరోజు వైభవంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా మూడవరోజు చంద్రఘంట రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.