14 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: ఏవో

14 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: ఏవో

W.G: నరసాపురం మండల పరిధిలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏడాది మొత్తం 14 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏవో జ్యోషిలా తెలిపారు. గతంలో ఉన్న కేంద్రాలతో పాటు, కొత్తగా వై.ఎస్.పాలెం, లిఖితపూడి, కే.బేతపూడి గ్రామాల్లో కూడా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వారు తెలిపారు.