భూవినియోగ మార్పుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

భూవినియోగ మార్పుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

CTR: జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలోని 4.74 ఎకరాల భూమి వినియోగాన్ని మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్ జోన్‌గా ఉన్న ఈ భూమిని పబ్లిక్ & సెమీ పబ్లిక్ జోన్‌గా మార్చేందుకు అనుమతి ఇచ్చింది. గాబ్రియెల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఈ మార్పును ఖరారు చేసింది.