కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలి:డిప్యూటీ మేయర్
మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి కోరారు. 8వ డివిజన్ వార్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.