యాదాద్రి శ్రీవారికి శాస్త్రోక్తంగ లక్ష పుష్పార్చన

యాదాద్రి శ్రీవారికి శాస్త్రోక్తంగ లక్ష పుష్పార్చన

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వామి సన్నిధిలో శనివారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి.