5 నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ విశాఖలో పర్యటన
VSP: ఈ నెల 5, 6,7వ తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ విశాఖపట్నం, ఎ.యస్.ఆర్. జిల్లాలలో పర్యటిస్తారు .ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేది ఉదయం విశాఖపట్నం కలెక్టరేట్ లోని ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 7వ తేది అల్లూరి జిల్లాలో పర్యటిస్తారు.