మార్కాపురం జిల్లా కలెక్టర్ను కలిసిన ఎస్పీ
మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతను బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల గురించి మాట్లాడుకున్నారు. పోలీస్ శాఖ, పరిపాలక అధికార యంత్రాంగం మధ్య సమన్వయం, అలాగే జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు.