ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు ఎంపికైన రాజోలు కుర్రాడు

కోనసీమ: ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు రాజోలు మండలం గుడాలకు చెందిన సురేష్ కుమార్ ఎంపికయ్యాడు. ఆగస్టు 8 నుంచి వైజాగ్లో జరిగే మ్యాచ్లలో అతను తుంగభద్ర వారియర్స్ తరఫున ఆడనున్నట్లు మంగళవారం సమావేశంలో సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఐపీఎల్కు ఎంపిక కావాలని ఆకాంక్షిస్తూ సీనియర్ క్రికెటర్లు భారం రాజా, దేవళ్ల శ్రీనాథ్లు అతనికి అభినందనలు తెలిపారు