వైద్య సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సోమవారం ఆలేరు మండలం బహదూర్పేటలోని హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.