నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధే లక్ష్యం: ఐటీడీఏ పీవో

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధే లక్ష్యం: ఐటీడీఏ పీవో

ASR: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. నిన్న ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. స్వయం ఉపాధి రుణాలతో గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు.