పిడుగు పడి వ్యక్తి మృతి
SKLM: మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామానికి చెందిన వినోద్ (40) మహేంద్రగిరి పర్వతంపై పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. మృతునికి భార్య సంతోషి, ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.