మిర్యాలగూడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. బస్టాండ్ ప్లాట్ఫారమ్లపై ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. చాలామంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా భద్రతను ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కొరారు.