భారత్ గెలుపు కోసం పూజలు
CTR: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ మహిళల జట్టు గెలపొందాలని కాంక్షిస్తూ చిత్తూరు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం గిరింపేట దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా జుట్టుపై విజయం సాధించాలని, భారత జట్టుకు అవసరమైన మనోధైర్యాన్ని ఇవ్వాలని పూజల నిర్వహించారు.