బస్సు టైరు కిందపడి మహిళ మృతి
AP: గుంటూరు ఆర్టీసీ బస్టాండులో బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. బస్టాండ్ ఇన్గేటు వద్ద బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహిళను ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టడంతో మహిళ టైరు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.