నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
RR: చేవెళ్ల, కందుకూరు డివిజన్లోని 7 మండలాల పరిధిలోని 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఈరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆయా మండలాల్లోని ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక రిటర్నింగ్ కేంద్రాన్ని ఎంపిక చేయగా.. రిటర్నింగ్ ఆఫీసర్తో సహా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నియమించారు. కాగా, DEC 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.