VIDEO: SI లేక బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణలో జాప్యం
MNCL: నెన్నెల పోలీసుస్టేషన్లో ఎస్సై లేకపోవడంతో కేసులు పెండింగ్లో పడుతున్నాయి. FIR నమోదు, బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణలో జాప్యం జరుగుతోంది. SI ప్రసాద్ తాండూర్కు బదిలీ కాగా కటకనపల్లి మహేందర్ను SIగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజులు గడుస్తున్నా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన విముఖత చూపుతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.