గ్రామాన్ని తరలించాలని డిమాండ్
AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామాన్ని తరలించాలని సీపీఎం నాయకుడు శంకర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 22 ఏళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు కాలేదని విమర్శించారు. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.