ధాన్యం కొనుగోలు సమస్యపై స్పందించిన మాజీ మంత్రి

MHBD: తొర్రూరు మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రైతులు ఫోన్లో తెలిపారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఆయన, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, జిల్లా అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.