ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

ప. గో: భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంకెం సీతారామ్ ఆధ్వర్యంలో చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రధానిగా సుమారు 15 సంవత్సరాలు విశేష సేవలు అందించిన ఘనత మన రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు.