ఓబులాపురం మైనింగ్‌ కేసు విచారణ వాయిదా

ఓబులాపురం మైనింగ్‌ కేసు విచారణ వాయిదా

ఓబులాపురం మైనింగ్ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి అప్పీల్ పిటిషన్‌ను విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మరో నలుగురి అప్పీల్ పిటిషన్లనూ తోసిపుచ్చింది. వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ కోర్టులోనే వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, నిన్న జనార్థన్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుంచి బెంగళూరుకు తరలించారు.