మధిరలో రోడ్డు ప్రమదంలో.. వ్యక్తి మృతి
KMM: మధిర మండలం అంబారపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నాగవరపాడు గ్రామానికి చెందిన తోక వెంకయ్య (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.