'ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికరించాలి'
SKLM: పాతపట్నంలోని ఐదు మండలాలలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికరించాలి అని MLA గోవిందరావు కోరారు. శనివారం విజయవాడలోని అసెంబ్లీ జీరో అవర్లో రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డిని ఆయన కలిశారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గంలో ఉన్న ఇండోర్ స్టేడియం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.