రోడ్డుపై నడవలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
PPM: సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి వెళ్లే తారు రహదారి పూర్తిగా ఛిద్రమైంది. కూడలి నుంచి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల మార్గం నామరూపాల్లేకుండా తయారైంది గ్రామస్థులు తెలిపారు. రాళ్ల కుప్పలు పరిచినట్లు మారిందన్నారు. నడిచి వెళ్తే కాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నాయని, వాహనాలపై వెళ్లా మంటే టైర్లు తరచూ పంక్చర్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.