క్రికెట్ బెట్టింగ్.. ఆరుగురు అరెస్ట్
AP: IPL క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న బుకీలను పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలోని ఐలా బజార్లో బెట్టింగ్ జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4.58 లక్షలు, ల్యాప్టాప్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను DSP అభినందించి, రివార్డ్స్ అందజేశారు.