రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: విడవలూరు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని స్థానిక అధికారులు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపించిన సమానత్వ, న్యాయం మార్గంలో అందరం నడవాలి అని పిలుపునిచ్చారు.