జిల్లా జనరల్ సెక్రటరీగా శివరాజు
Akp: జిల్లా వైసీపీ యువజన విభాగం జనరల్ సెక్రటరీగా గొలుగొండ మండలం చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన పెనుమత్స శివరాజును నియమించారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్రతిపాదన మేరకు ఈయన నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తనకు అప్పగించిన ఈ బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు.