VIDEO: చేపల మార్కెట్ను వినియోగంలోకి తేవాలి: కలెక్టర్
WNP: గోపాలపేట మండల కేంద్రంలో నిర్మించిన చేపల మార్కెట్ను వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. చేపల మార్కెట్ను కలెక్టర్ పరిశీలించి దాని వినియోగంలోకి తీసుకురావడానికి వెంటనే బోర్ ద్వారా నీటి ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం తరపున సభ్యులు కలెక్టర్ను శాలువాతో సత్కరించారు.