ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక వన్డేలో టీమిండియా ఎట్టేకేలకు టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా 2023 వన్డే వరల్ కప్ ఫైనల్ తర్వాత భారత్ టాస్ గెలవడం ఇదే తొలిసారి. ఈక్రమంలో 20 వన్డేల్లో టాస్ ఓడింది. ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో.. 3 వన్డేల సిరీస్ ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ సొంతమవుతుంది.