పులుల దాడి.. ఇద్దరు మృతి

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో పులుల దాడులు ఆగటం లేదు. మూల్ తాలుకాలో రెండు చోట్ల పులులు దాడి చేయగా ఇద్దరు మృతి చెందారు. చిరోలి అటవీ ప్రాంతంలో పులి దాడిలో మేకల కాపరి సురేష్ ప్రాణాలు విడిచాడు. మరో చోట భావనాపూర్ వద్ద నంద అనే మహిళ చనిపోయింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పులుల దాడుల్లో 11 మంది కన్నుమూశారు.