సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
AKP: సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు తెలిపారు. శుక్రవారం ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.