నగర కమిషనర్కు మహిళ జర్నలిస్టులు ఫిర్యాదు
HYD: మహిళ జర్నలిస్టులు నగర కమిషనర్ V.C సజ్జనార్ను కలిశారు. తమను కొందరు ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తూ వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ను వారు కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న లింకులు, స్క్రీన్ షాట్లు, వీడియోలను తన ఆఫీసులో ఇవ్వాలని, వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.