కలుషిత నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
E.G: సింగరాజుపాలెం ఎస్సీ కాలనీలో పైపుల ద్వారా మురికినీరు వస్తోందని కాలని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కలుషిత నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు పెరిగినట్లు స్థానికులు తెలిపారు. సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో సమస్యను పట్టించుకునే వారు లేరని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటరాజు స్పందించి అధికారులతో వెంటనే మరమ్మతులు చేయించారు.