పులి సంచారం.. ఆందోళనలో స్థానికులు

పులి సంచారం.. ఆందోళనలో స్థానికులు

E.G: పోలవరం జిల్లా కొయ్యలవీరవరం, లింగంపల్లి కొండల్లో పులి ఉన్నట్లు శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా అధికారులు సోమవారం గుర్తించారు. ఇది పాపికొండల నేషనల్ పార్క్ సమీపంలో ఉండటంతో నిర్వాసిత గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉన్నా, కొండ దిగువన ఉన్న పశువులపై పులి దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.