ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టివేత

ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టివేత

NZB: వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులకు గంజాయి లభ్యమైంది. ఈ ఘటన బోధన్​ పట్టణ శివారులో చోటు చేసుకుంది. బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ తెలిపిన వివరాలు..​ పట్టణ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా బిలోలి నుంచి బోధన్​ వస్తున్న ఆటోను పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఒక కేజీ 270 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులని రిమాండ్​కు తరలించినట్లు ఆయన వివరించారు.