సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విప్, ఎమ్మెల్యేలు
KNR: రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. తొలి విడతగా ఎకరం వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు జమ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.