స్కూటర్ల ఎంపిక శిబిరం వాయిదా: జేసీ
సత్యసాయి: పుట్టపర్తిలో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన దివ్యాంగుల మూడు చక్రాల స్కూటర్ల అర్హత ఎంపిక శిబిరం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేయబడింది. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఈ మార్పును గమనించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. తదుపరి తేదీని ప్రకటించే వరకు ఎవరూ పుట్టపర్తికి రావద్దని ఆయన కోరారు.