16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

SKLM: కొత్తూరు మండల కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పై విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. గృహ వినియోగం కోసం ఇచ్చే ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార నిమిత్తం వాడుతున్నట్లు గుర్తించారు. ఐదు హోటళ్లలో మొత్తం 16 సిలిండర్లు స్వాధీనం చేసుకుని రూ.38,200 జరిమానా విధించినట్లు విజిలెన్స్ సీఐ సతీశ్ కుమార్ తెలిపారు.