ఎక్సైజ్ ఎస్ఐ అభ్యర్థులకు ఫిజికల్, మెడికల్ పరీక్షలు

ఎక్సైజ్ ఎస్ఐ అభ్యర్థులకు ఫిజికల్, మెడికల్ పరీక్షలు

కర్నూలు: జోన్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఎంపికైన అభ్యర్థులకు శుక్రవారం దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. హనుమంతరావు సమక్షంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జావిద్ బృందం ఫిజికల్ పరీక్షలు నిర్వహించింది. అనంతరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మెడికల్ పరీక్షలు జరిగాయి.