కేవైసీపై అవగాహనకు బీబీనగర్లో వాక్థాన్
BHNG: ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ సురక్షిత బ్యాంకింగ్ మీ తొలి అడుగు అనే అంశంతో బీబీనగర్ గ్రామంలో మంగళవారం వాక్ థాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలకు కేవైసీ ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు గురించి అవగాహన కల్పించారు.