వాటర్ ఫౌంటెన్ను ప్రారంభించిన మేయర్
నెల్లూరు రూరల్ 36వ డివిజన్ బట్వాడిపాలెం సెంటర్లో రూ. 50 లక్షలతో నిర్మించిన వాటర్ ఫౌంటెన్ను మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వై.ఓ. నందన్, TDP గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.