వాహనాలను విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు

వాహనాలను విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు

NGKL: జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అధికారులు సూచించారు. సరైన పత్రాలు లేకపోయినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.