ఒంగోలులో 30 యాక్ట్ అమలు

ఒంగోలులో 30 యాక్ట్ అమలు

ప్రకాశం: ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్లో ఈ నెల ఒకటో తారీకు నుంచి 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు చెప్పారు. ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.