సింహాద్రి అప్పన్నకు 108 స్వర్ణపుష్పాలతో అర్చన

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై స్వామిని అధీష్టించి వేద మంత్రాలు నడుమ స్వామివారి స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.