ఐదేళ్ల చిన్నారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

ఐదేళ్ల చిన్నారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడుకు చెందిన కె.నారాయణస్వామి కుమార్తె ఐదేళ్ల భావన అనారోగ్యంతో విజయవాడలోని అనురాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆపరేషన్ కోసం అవసరమైన రూ.1.20 లక్షల ఎల్‌వోసీని ఎమ్మెల్యే పరిటాల సునీత మంజూరు చేయించారు. శనివారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ఈ పత్రాన్ని చిన్నారి తండ్రికి ఆమె అందజేశారు.