'కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు'

'కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు'

KMR: ఎల్లారెడ్డి CHCలో గురువారం కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు వెల్లడించారు. చూపు మందగించిన వ్యక్తులు అద్దాలు వాడాలని సూచించారు.